చేవెళ్ల ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి సాహితి
- బుధవారం నామినేషన్ దాఖలు చేసిన వైనం
- ఇటీవల కాలంలో ఇన్స్టా వేదికగా రాజకీయాలపై స్పందిస్తున్న సాహితి
- తన రీల్స్ ఏ పార్టీనీ ఉద్దేశించినవి కావని స్పష్టీకరణ
పొలిమేర, పొలిమేర-2 చిత్రాలతో సాహితి నటన సినీప్రేక్షకులను మెప్పించింది. తొలి భాగంలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె సీక్వెల్లో రాజేశ్తో కలిసి నటించారు. తను పవన్ కల్యాణ్ అభిమానినని చెప్పుకునే ఆమె ఇటీవల కాలంలో తన ఇన్స్టాలో రాజకీయాలపై కూడా స్పందించారు. అయితే, తన ఇన్స్టా రీల్స్కు రాజకీయాలు ఆపాదించొద్దని కూడా ఆమె కోరారు. ఇక చేవెళ్ల నుంచి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు.