భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు
- భూకబ్జా ఆరోపణలపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదు
- రాగన్నగూడలో తన 200 గజాల ప్లాట్ను కబ్జా చేశారని రాధిక అనే మహిళ ఫిర్యాదు
- 447, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ... ప్లాటును కిరణ్ కుమార్ రెడ్డి 2003లోనే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. రాధిక వద్ద 2015లో ప్లాట్ కొనుగోలు చేసినట్లుగా పత్రాలు ఉన్నట్లు తెలిపారు. ఇద్దరి డాక్యుమెంట్లను తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని ఆదిభట్ల పోలీసులు తెలిపారు.