మిథున్ రెడ్డి రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు: కిరణ్ కుమార్ రెడ్డి
- మదనపల్లెలో కూటమి నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం
- ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని వ్యాఖ్య
- మదనపల్లి జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ
బాబ్రీ మసీదు స్థల వివాదంలో హిందూ దేవాలయం కోసం 2.74 ఎకరాల స్థలాన్ని ఇస్తే... ముస్లింల మసీదు కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని అన్నారు. 6 ముస్లిం దేశాలు ప్రధాని మోదీకి అవార్డులు ఇచ్చాయని చెప్పారు. పదేళ్లు రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి లిక్కర్, ఇసుకతో రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.