ఆ కుటుంబాలకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి.. ఆ తర్వాతే ఓట్లు అడగాలి: ఆనం
- వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారన్న ఆనం వెంకటరమణారెడ్డి
- ఆయన గురించి ఏం తెలుసని విజయసాయి మాట్లాడుతున్నారని ప్రశ్న
- దొంగసారా, నాసిరకం బియ్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన
- బిల్లులు చెల్లించాకే జగన్ సిద్ధం సభలు పెట్టుకోవాలని డిమాండ్
పీఎల్ఆర్ కనస్ట్రక్షన్స్కు ఆరు నెలల్లో బిల్లులన్నీ చెల్లించారని, కానీ గతేడాది జులై నుంచి ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు నిలిచిపోయాయని ఆనం తెలిపారు. ఎంఎస్ఎంఈలకు నెలన్నరలోనే చెల్లింపులు చేయాలన్న నిబంధనలున్నాయని, కానీ వాటిని తుంగలో తొక్కి చెల్లింపులు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో జగన్ ముద్దుబిడ్డ అయిన పీఎల్ఆర్ కనస్ట్రక్షన్స్, విశ్వేశ్వరరెడ్డి షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు మాత్రం వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన పనులు, వైసీపీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించిన తర్వాతే జగన్ సిద్ధం సభలు పెట్టాలని ఆనం డిమాండ్ చేశారు.