విడాకుల వార్తకు చెక్ పెట్టిన నయనతార.. ఇదిగో ఫొటో
- నయనతార, విఘ్నేష్ జంటపై కొన్నిరోజులుగా విడాకుల రూమర్స్
- తాజా ఫొటోతో అందరి నోర్లు మూయించిన నయన్
- ఖుషీ అవుతున్న అభిమానులు
అంతే.. లేడీ సూపర్ స్టార్ తాజాగా మరో ఫొటోను షేర్ చేసి అందరి నోర్లు మూయించారు. భర్త విఘ్నేష్తో పాటు తమ పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్తున్న సమయంలో తీసిన ఫొటోను షేర్ చేశారు. నయన్ తన ఫ్యామిలీతో కలిసి జెడ్డా టూర్కి వెళ్లినట్లు సమాచారం. అలా జెడ్డాకు విమానంలో వెళ్తున్న సమయంలో తీసిందే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో.
దీనికి 'చాలా కాలం తర్వాత ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్నా' అనే క్యాప్షన్ ఇచ్చారామె. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలాఉంటే.. నయనతార, విఘ్నేష్ జంట 2022 జూన్ 9న పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్లో నయనతారకు సరోగసీ ద్వారా కవలలు కలిగారు.