రూ. 5 కోట్లతో బాంద్రాలో ఇంటిని కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్
- టీమిండియా టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా మారిన జైస్వాల్
- ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు
- బాంద్రాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో 1100 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ కొనుగోలు
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో జైస్వాల్ చెలరేగి ఆడుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదాడు. ఆరు ఇన్నింగ్స్లలో 109.00 సగటుతో 545 పరుగులు సాధించి ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.