సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో అంటే అంతేమరి!
- తమ మేనిఫెస్టోలో ఉచితాల ఊసే ఉండదన్న లక్ష్మీనారాయణ
- మేనిఫెస్టో ముసాయిదా రెడీ అవుతోందన్న జేబీఎన్పీ చీఫ్
- సలహాలు, సూచనలు ఇవ్వాలని అభ్యర్థన
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఉచితాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్న పార్టీ ఒకటుంది. అదే జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ). సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల ఈ పార్టీని ప్రారంభించారు. తమ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా తయారవుతోందని, సలహాలు సూచనలు కావాలని ఎక్స్ ద్వారా ప్రజలను కోరారు. తమ మేనిఫోస్టోలో అభివృద్ధి మాత్రమే ఉంటుందని, ఉచితాలకు అందులో చోటు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు.