Ayodhya: రేపటి నుంచి ఇంటింటికీ రాముడి అక్షింతలు

From January1 Ram lallah Akshat Will Be Distributed Door to Door

  • ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
  • శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
  • జన సంపర్క అభియాన్ కార్యక్రమం

బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జన సంపర్క అభియాన్ కార్యక్రమం చేపట్టింది. అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షింతలను ఇంటింటికీ చేర్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈమేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

రాముడి అక్షింతలతో పాటు చిత్రపటం, మందిరం నమూనా కరపత్రాన్ని ఇంటింటీకీ చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పండరీనాథ్, జన సంపర్క అభియాన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్, రామ్ సింగ్, నరసింహమూర్తి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News