Congress: 50 శాతానికిపైగా ఓట్లు సాధించిన 51 మంది అభ్యర్థులు.. కాంగ్రెస్ వారే అధికం!
![39 Congress Candidates Got Over 50 Precent Of Vote Share](https://imgb.ap7am.com/thumbnail/cr-20231204tn656d432c778aa.jpg)
- 64.88 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ
- 55.45 శాతం ఓట్లు సాధించిన మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్
- 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిలో 39 మంది కాంగ్రెస్ అభ్యర్థులే
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్థుల్లో 51 మంది ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లు సాధించారు. వీరిలో 39 మంది కాంగ్రెస్ అభ్యర్థులే ఉండడం గమనార్హం. చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ 64.88 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్ 55.45 ఓట్ల శాతంతో చివరన ఉన్నారు.
మిగతా అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా ఇలా
![](https://img.ap7am.com/froala-uploads/20231204fr656d4227517ca.jpg)