స్కిల్ కేసులో మరొకరికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు!
- సీమెన్స్ కంపెనీ డైరెక్టర్ సత్యభాస్కర్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు
- మధ్యంతర బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మార్చిన ధర్మాసనం
- ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబు
ఈ కేసులో తొలుత సత్యభాస్కర్ ను అరెస్ట్ చేసిన సీఐడీ... విజయవాడలోని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది. పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు నిందితుడికి అవినీతి నిరోధక చట్టం వర్తించదని పేర్కొంటూ రిమాండ్ విధించేందుకు నిరాకరించింది. దీంతో, ఏపీ హైకోర్టును సీఐడీ ఆశ్రయించగా... ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ సత్యభాస్కర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ రెడ్డి నిరాకరించారు. దీంతో సత్యభాస్కర్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆగస్టు 22న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది.
మరోవైపు ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే.