AP Mithun Reddy: ఒకే ఒక్క అభ్యర్థి పేరుతో తెలంగాణ బీజేపీ రెండో జాబితా విడుదల

BJP releases second list with single name

  • ఇటీవల 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
  • నేడు రెండో జాబితా విడుదల
  • మహబూబ్ నగర్ స్థానానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డికి టికెట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇటీవల 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేడు రెండో జాబితా విడుదల చేసింది. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరుంది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మిథున్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు. జితేందర్ రెడ్డి 1999లో బీజేపీ ఎంపీగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. 2019లో ఆయన బీజేపీలోకి తిరిగొచ్చారు. ఈసారి తన రాజకీయ వారసుడిగా కుమారుడికి బీజేపీ టికెట్ ఇప్పించుకోవడంలో జితేందర్ రెడ్డి కృషి ఫలించింది.

AP Mithun Reddy
BJP
Second List
Mahaboobnagar
Assembly Election
Telangana
  • Loading...

More Telugu News