ఆదిరెడ్డి అప్పారావు బెయిల్ ను సమర్థించిన సుప్రీంకోర్టు
- జగత్ జనని చిట్ ఫండ్ కేసులో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు అరెస్ట్
- అప్పారావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ
- అప్పారావు తరపున వాదనలు వినిపించిన లూథ్రా
సీఐడీ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఐడీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా... ఆదిరెడ్డి అప్పారావు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు... హైకోర్టు బెయిల్ ను సమర్థించింది. చంద్రబాబు కేసులను కూడా లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే.