విశాల్ ను లంచం అడిగిన వాళ్లకు సెన్సార్ బోర్డుకు సంబంధంలేదట..!
- హీరో ఆరోపణలపై కేంద్ర సెన్సార్ బోర్డు వివరణ
- ఆయన వద్ద డబ్బులు తీసుకున్నది దళారులేనని వెల్లడి
- పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరణ
డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తమ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు అన్ని నియమనిబంధనలను పాటిస్తూ ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర సెన్సార్ బోర్డు సూచించింది. అదే సమయంలో త్వరగా సర్టిఫికెట్ ఇవ్వాలంటూ బోర్డు సభ్యులపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరింది. ఏటా బోర్డు ముందుకు 18 వేలకు పైగా సినిమాలు సెన్సార్ సర్టిఫికెట్ కోసం వస్తాయని తెలిపింది. వాటిని చూసి సెన్సార్ చేసేందుకు సమయం పడుతుందని గుర్తుచేస్తూ.. సర్టిఫికెట్ త్వరగా ఇవ్వాలంటూ సభ్యులను కోరవద్దని పేర్కొంది.