UK: భారత్‌లో అడుగు పెట్టే ముందు రిషి సునక్ 'నెక్ టై' సరిచేసిన భార్య.. వైరల్ అవుతున్న ఫొటో

Pic of Akshata Murty fixing Rishi Sunaks tie is viral

  • జీ20 సమావేశాల కోసం నిన్న భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్
  • ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యే ముందు  నెక్ టై సరిచేసిన భార్య
  • భారత్‌ కు చెందిన అక్షితా మూర్తిని పెళ్లి చేసుకున్న రిషి

భారత్ తొలిసారి నాయకత్వం వహిస్తూ ఆతిథ్యం ఇస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రపంచ దేశాల అధినేతలు మన దేశానికి వచ్చారు. శనివారం ఢిల్లీలో మొదలైన ఈ సదస్సు ఆదివారం వరకు జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరైన దేశాధినేతల్లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన భారత్ కు చెందిన అక్షితా మూర్తి (ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు)ని పెళ్లి చేసుకున్నారు. దాంతో బ్రిటన్ ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్ కు వచ్చిన రిషిని ప్రధాని మోదీ ఆత్మీయంగా హత్తుకొని జీ20 సదస్సుకు ఆహ్వానం పలికారు. 

ఈ సదస్సు కోసం ఢిల్లీ సమీపంలోని పాలమ్ విమానాశ్రయంలో దిగే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో రిషి సునక్ షేర్ చేసిన ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. విమానాశ్రయంలో దిగే ముందు అక్షితా మూర్తి తన భర్త సునక్ నెక్ టైని శ్రద్ధగా సరిచేస్తూ కనిపించారు. ఈ ఫొటో ఇద్దరి మధ్య అన్యోన్యతను తెలిపేలా ఉంది. క్షణాల్లో వైరల్ అయిన ఫొటో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 
.

  • Loading...

More Telugu News