నా టిక్కెట్ను కేసీఆర్ ఎందుకు ఆపారో అర్థం కావడం లేదు: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
- టిక్కెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే ధీమా
- తనకు కేసీఆర్ న్యాయం చేస్తారని వ్యాఖ్య
- పార్టీ మారే సమస్యే ఉత్పన్నం కాదన్న ఎమ్మెల్యే
టిక్కెట్ రాకుంటే పార్టీ మారుతారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అసలు ఆ సమస్యే ఉత్పన్నం కాదన్నారు. తాను ఎటూ వెళ్లేది లేదనీ... అలాగే కేసీఆర్ తనకే టిక్కెట్ ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. తనకు కేసీఆర్ న్యాయం చేస్తాడని చెప్పారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ అని, పార్టీ మారేది లేదన్నారు. తనను నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు గెలిపించారన్నారు.