జగన్ ను దేవుడితో పోల్చడం ఏమిటి?: వైసీపీ మంత్రులపై రఘురాజు ఫైర్
- రుషికొండకు గుండు కొట్టించి ఇల్లు కట్టుకున్న వ్యక్తిని దేవుడితో పోలుస్తారా అన్న రఘురాజు
- జగన్ కట్టుకున్న అక్రమ భవనం సీఆర్ జెడ్ జోన్ లోకి వస్తుందని ఆరోపణ
- ఈ భవనాలను కొత్త ప్రభుత్వం కూల్చేయాలని వ్యాఖ్య
కొండపై కట్టిన నాలుగు బ్లాకులకు 4 పేర్లు పెట్టారని రఘురాజు తెలిపారు. వీటిలో సీఎం నివాస సముదాయం, క్యాంపు కార్యాలయం, కార్యదర్శుల కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని అన్నారు. టూరిజం కాటేజీల ముసుగులో నిర్మించుకున్న ఈ అక్రమ భవానాలను కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం కూల్చి వేయాలని చెప్పారు. ఈ భవనాల నిర్మాణాలకు వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.