సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు వైఎస్ అవినాశ్ రెడ్డి లేఖ
- కీలక మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు విచారణ
- రామ్ సింగ్ దర్యాప్తును పునఃసమీక్షించాలని సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాసిన అవినాశ్
- రెండో భార్య పేరిట ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకుపోవడానికి హత్య చేసి ఉండొచ్చని ఆరోపణ
దస్తగిరి ఇచ్చిన సమాధానాల ఆధారంగా రామ్ సింగ్ విచారణ జరిపారని అవినాశ్ తెలిపారు. రెండో భార్య పేరిట ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకుపోవడానికే హత్య చేసి ఉండొచ్చని చెప్పారు. విచారణలో రామ్ సింగ్ చేసిన తప్పులను సవరించాలని కోరారు. మున్నా లాకర్ లో ఉన్న నగదుకు సంబంధించిన వివరాలను ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హత్య చేసిన నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరారు.