ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపే కుట్ర చేస్తున్నారు: దస్తగిరి
- వివేకా హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి
- పిల్లాడిని కిడ్నాప్ చేసి హింసించినట్టు కేసు నమోదు
- భార్య షబానాతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీ అవినాశ్రెడ్డి అనుచరులు, వైసీపీ నేతలు తమను బెదిరిస్తున్నట్టు చెప్పారు. నిజంగానే తానేవైనా సెటిల్మెంట్లు చేసినా, ఎవరినైనా బెదిరించినా ఆ విషయం తన వద్దనున్న గన్మెన్కు తెలుస్తుంది కదా? అని ప్రశ్నించారు. తనపై పెట్టిన తప్పుడు కేసు గురించి సీబీఐ ఎస్పీకి, జిల్లా న్యాయమూర్తికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టు దస్తగిరి తెలిపారు.