నాడు హరీశ్ రావు నాతో గొడవ పడ్డారు: కిరణ్ కుమార్ రెడ్డి
- తాను సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు రూ.7400 కోట్లు కేటాయించానని చెప్పిన మాజీ సీఎం
- జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న కిరణ్
- ప్రజా జీవితంలో ఉండాలా వద్దా అని ఆలోచించినట్లు వెల్లడి
కానీ ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఆ మంచినీటి పథకాన్ని పక్కన పెట్టాయన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇలా పనులు ఆపివేయడం సరైనది కాదన్నారు. ప్రాంతీయ పార్టీలు ఖజనా నింపుకోవడంపై దృష్టి సారిస్తాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.