దేవినేని ఉమపై గెలిచినందుకు నాకు బలుపే.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
- నాలుగుసార్లు గెలిచిన ఉమపై 13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచానన్న మైలవరం ఎమ్మెల్యే
- గ్రావెల్, ఇసుకను దోచుకుని ఆయన ఎదిగారని ఆరోపణ
- ఎన్టీఆర్ జిల్లాలో ఉమ వైసీపీకి అనుకూల శత్రువని వ్యాఖ్య
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ వల్లే కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు టీడీపీని వీడి వైసీపీలో చేరారని విమర్శించారు. ఉమ ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీకి 500 ఓట్లు తగ్గుతాయని ఎద్దేవా చేశారు. నందిగామలో కనుక ఉమ ప్రచారం చేస్తే అక్కడ రెండోసారి కూడా జగన్మోహన్రావే గెలుస్తారని జోస్యం చెప్పారు.