జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన
- భారత ప్రధాని మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ఖరారు
- జూన్ 22న అమెరికాకు వెళ్లనున్న మోదీ
- మోదీకి ఆతిథ్యమివ్వనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
- భారత ప్రధాని కోసం స్టేట్ డిన్నర్ ఏర్పాటు
- ఇండో పసిఫిక్, క్వాడ్ కూటమిపై ఇరు నేతల మధ్య చర్చ
ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, ప్రథమ మహిళ జిల్ బైడెన్ మోదీ కోసం స్టేట్ డిన్నర్ (అధికారిక విందు) ఏర్పాటు చేశారని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేసే అవకాశాలపై ఇరు నేతలు ఈ పర్యటనలో చర్చించనున్నారు. అంతేకాకుండా, స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. మోదీ చేపట్టనున్న తొలి అధికారిక అమెరికా పర్యటన ఇదే కావడంతో ఈ పర్యటనకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. రాబోయే నెలల్లో జరగనున్న జీ7, క్వాడ్ సమావేశాల్లోనూ మోదీ, జో బైడెన్ పాల్గొంటారు.