చరిత్ర సృష్టించిన తెలుగు ఆటగాడు
- ఆసియా బ్యాడ్మింటన్ లో ఫైనల్ చేరిన సాత్విక్, చిరాగ్
- ఈ ఘనత సాధించిన భారత తొలి జంటగా రికార్డు
- రజతం ఖాయం చేసుకున్న సాత్విక్ జంట
వాంగ్ చిన్ గాయపడి తప్పుకోవడంతో వాకోవర్ లభించిన సాత్విక్, చిరాగ్ నేరుగా ఫైనల్ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ సిన్ యెవ్–యి యె (మలేసియా) జంటతో సాత్విక్–చిరాగ్ అమీతుమీ తేల్చుకుంటారు. ఈ టోర్నీ పురుషుల డబుల్స్ లో భారత్ కు ఇప్పటిదాకా ఒకే ఒక్క కాంస్య పతకం 52 ఏళ్ల క్రితం లభించింది. ఫైనల్లో ఓడినా రజతం సాధించిన జంటగా సాత్విక్, చిరాగ్ చరిత్రలో నిలుస్తారు.