ఒక్కచోటా గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారు: లక్ష్మీపార్వతి
- లోకేశ్ పాదయాత్రలో రోజుకో కామెడీ బాగుందన్న లక్ష్మీపార్వతి
- ఏపీలో ప్రతిపక్ష పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శ
- సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవల్ని పోషిస్తున్నారని మండిపాటు
ఏపీలో ప్రతిపక్ష పార్టీ రోజు రోజుకు దిగజారి పోతోందన్నారు. అమరావతిలో ఇన్సైడర్ పేరుతో మోసాలు చేశారని, పోలవరం పేరుతో మోసాలు చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవల్ని, కుక్కల్ని పోషిస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు సైకో అని, ఆయన పాపాలు పండిపోయాయని లక్ష్మీ పార్వతి అన్నారు. దుబాయ్, స్విట్జర్లాండ్ లో చంద్రబాబు రూ.ఐదు లక్షల కోట్లు దాచి పెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ నల్లధనం బయటకు తెప్పించి, స్వదేశానికి రప్పించాలని కోరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమి మాట్లాడతారోనని లక్ష్మీపార్వతి సెటైర్ వేశారు. ఆయన మాట్లాడి ఆరునెలలు దాటినా అర్థం కాదన్నారు.