కామన్ మేన్ ఇన్వెస్టిగేషన్ ఇలాగే ఉంటుంది: 'ఆహా'లో స్ట్రీమింగ్ కానున్న 'క్రాంతి'
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే 'క్రాంతి'
- కొత్త నటీనటులతో రూపొందిన సినిమా
- దర్శకత్వం వహించిన భీమ శంకర్
- రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
అంతా కొత్త టీమ్ తో రూపొందించిన ఈ సినిమాను భార్గవ్ మన్నే నిర్మించగా, 'భీమ శంకర్ దర్శకత్వం వహించాడు. రేపటి నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కంటెంట్ పై ఇంట్రెస్ట్ పెరిగేలానే ట్రైలర్ ఉంది.
కాకినాడ పరిసర ప్రాంతాల్లో అమ్మాయిల కిడ్నాపులు వరుసగా జరుగుతుంటాయి. అమ్మాయిలను బయటికి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతుంటారు. ఎలాంటి క్లూస్ లేని ఈ కేసును ఛేదించడానికి ఒక కామన్ మేన్ రంగంలోకి దిగుతాడనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'కామన్ మేన్ ఇన్వెస్టిగేషన్ ఇలాగే ఉంటుంది' అంటూ హీరో చెప్పే డైలాగ్ .. కంటెంట్ పై ఆసక్తిని పెంచుతోంది.