మోహన్ లాల్ ను కొన్నేళ్లుగా వెంటాడుతున్న కేసు.. ఏమిటో తెలుసా?
- గతంలో మోహన్ లాల్ ఇంట్లో ఐటీ సోదాలు
- తనిఖీల్లో అలంకరణకు వాడిన ఏనుగు దంతాల గుర్తింపు
- చట్ట ప్రకారమే వాటిని తాను తీసుకున్నానంటున్న మోహన్ లాల్
మోహన్ లాల్ కు తలనొప్పిని తీసుకొస్తున్న కేసు ఏనుగు దంతాలకు సంబంధించినది. ఆయన ఇంట్లో అలంకరణకు వాడిన ఏనుగు దంతాలు ఉన్నాయి. గతంలో ఆయన ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ సందర్భంగా ఏనుగు దంతాలను చూసిన అధికారులు ఆయనపై వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
చట్టానుసారమే వాటిని తాను తీసుకున్నానని ఆయన చెప్పినప్పటికీ విముక్తి కలగలేదు. మోహన్ లాల్ ను దోషిగా పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేయగా... కేరళ హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా మరోసారి విచారణ జరపాలని మేజిస్ట్రేట్ ను హైకోర్టు ఆదేశించింది. దీంతో, కథ మళ్లీ మొదటికి వచ్చింది.