టీపీసీసీ అధ్యక్షుడివా? లేక కేంద్రానికి వంతపాడుతున్నావా?: రేవంత్ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
- రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ
- పత్తికి మద్దతు ధర లేదని విమర్శ
- మద్దతు ధర కేంద్రం పరిధిలో విషయమన్న నిరంజన్ రెడ్డి
దీనిపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. నువ్వు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడివా? లేక కేంద్రానికి వంతపాడుతున్నావా? అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పత్తి గిట్టుబాటు ధర రాష్ట్రం పరిధిలో ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా, సీఎంకు లేఖ రాయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మాట తప్పిన కేంద్రాన్ని ఏనాడైనా నిలదీశావా? అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.