'ఏం మాయ చేశావే'కి సీక్వెల్.. హీరోయిన్ గా రష్మిక?
- 2010లో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం
- యువతను ఆకట్టుకున్న చైతన్య, సమంత కెమిస్ట్రీ
- రెండో పార్టులోనూ హీరోగా నటించనున్న నాగచైతన్య!
కానీ, ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగలేక ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఏం మాయ చేశావే వచ్చిన 12 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తీస్తారన్న ప్రచారం జరుగుతోంది. చిత్ర బృందం ఇప్పటికే స్ర్కిప్టు పనుల్లో నిమగ్నమై ఉందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. రెండో పార్టులో నాగచైతన్య హీరోగా నటిస్తాడని, హీరోయిన్ సమంత స్థానంలో రష్మిక మందన్న వస్తుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.