సీబీఐ కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి... ఓఎంసీ కేసులో నిందితులపై అభియోగాల నమోదు
- నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న ఓఎంసీ కేసు
- గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురిపై అభియోగాల నమోదు
- హైకోర్టు స్టే కారణంగా శ్రీలక్ష్మీపై అభియోగాల నమోదు వాయిదా
- నవంబర్ 11 నుంచి సాక్షుల విచారణ మొదలుపెట్టాలని కోర్టు నిర్ణయం
ఈ కేసులో .ప్రధాన నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు... ప్రస్తుతం తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న సబితా ఇంద్రారెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ అధికారులు కృపానందం, వీడి రాజగోపాల్, ఓఎంసీ కంపెనీ, అలీఖాన్ తదితరులపై కోర్టు అభియోగాలు నమోదు చేసింది. వీరంతా శుక్రవారం నాటి కోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు.