జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరుకుంది: నారా లోకేశ్
- మహనీయులను అవమానిస్తూ జగన్ రాక్షసానందం పొందుతున్నారన్న లోకేశ్
- మహారాజా ఆసుపత్రి పేరును మార్చడాన్ని ఖండిస్తున్నామని వ్యాఖ్య
- ఆసుపత్రికి మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్
నగరం నడి బొడ్డున విలువైన భూమిని ఆసుపత్రికి ఇచ్చింది మహారాజా కుటుంబమని... కేంద్ర మంత్రిగా నిధులను కేటాయించి అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసింది అశోక్ గజపతిరాజు అని చెప్పారు. రాత్రికి రాత్రి మహారాజా పేరును తొలగించారని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని... ఆసుపత్రికి మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.
