ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా మృతి పట్ల ప్రధాని మోదీ, చంద్రబాబు స్పందన
- రాకేశ్ ఝున్ ఝున్ వాలా హఠాన్మరణం
- తీవ్ర విచారంలో స్టాక్ మార్కెట్ వర్గాలు
- సంతాపం తెలిపిన మోదీ, చంద్రబాబు
- తిరుగులేని ఇన్వెస్టర్ అంటూ కితాబు
అటు, ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా రాకేశ్ ఝున్ ఝున్ వాలా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. రాకేశ్ ఝున్ ఝున్ వాలా మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఎంతో అనుభవమున్న ఇన్వెస్టర్, పారిశ్రామికవేత్తగా భారత పెట్టుబడిదారీ విపణిలో ఆయన భాగస్వామ్యం అపారమైనదని కీర్తించారు. దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ గా ఘనమైన వారసత్వాన్ని అందించారని కొనియాడారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు సంతాపం తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.