ప్రొద్దటూరు వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి ముస్లింల యత్నం
- ప్రొద్దటూరులో దర్గా జెండా చెట్టును కూల్చేసిన అధికారులు
- నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు
- వారితో చర్చలు జరిపిన ఎమ్మెల్యే రాచమల్లు
- ఆపై ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించిన ముస్లింలు
- కూల్చిన చోటే జెండాను ఏర్పాటు చేస్తామన్న అధికారులు
- శాంతించి వెనక్కు తగ్గిన ముస్లింలు
ఈ ఘటన వివరాల్లోకెళితే... పట్టణంలోని దర్గా జెండా చెట్టును సోమవారం మునిసిపల్ అధికారులు తొలగించారు. దీనిపై ముస్లింలు ఆందోళనకు దిగగా...వారితో చర్చించేందుకు ఎమ్మెల్యే రాచమల్లు తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన వివరాలను సావదానంగానే విన్న ముస్లింలు ఆయన అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైన వెంటనే ఆయన కారుపై దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన రాచమల్లు అనుచరులు వారిని అడ్డుకున్నారు.
అనంతరం కారు దిగిన రాచమల్లు మునిసిపల్ అధికారులను అక్కడికి పిలిపించారు. దర్గా జెండా చెట్టును కూల్చి వేసిన చోటనే జెండా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఆ మేరకు బుధవారం జెండా చుట్టూ గోడ నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. దీంతో శాంతించిన ముస్లింలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.