అలియాభట్ పోస్టర్ తో పాకిస్థాన్ లో ఓ రెస్టారెంట్ ఫుల్ బిజినెస్
- అలియా వేశ్య పాత్ర సీన్ తో పోస్టర్
- పురుషులకు 25 శాతం డిస్కౌంట్ ఆఫర్
- ‘ఆజావో రాజా.. మెన్స్ మండే డిస్కౌంట్ సొంతం చేసుకో’ అంటూ ప్రకటన
- తిట్టిపోస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై చాలా మంది పాకిస్థాన్ రెస్టారెంట్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అలియాభట్ పోస్టర్ ను వాడుకుంటూ రెస్టారెంట్ కు వచ్చే మగవారికి డిస్కౌంట్లు ప్రకటించడమే వివాదానికి దారితీసింది.
మెన్స్ మండే పేరుతో కరాచీలోని ఓ రెస్టారెంట్ ప్రకటన ఇచ్చింది. మగవారికి బిల్లులో 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ప్రకటనలో ’‘ఆజా నా రాజా - దేనికోసం ఎదురు చూస్తున్నావు?. ఆజావో.. మెన్స్ మండే రోజు 25 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకో’’ అన్న ట్యాగ్ లైన్ పెట్టాడు. నీవు పెట్టిన సీన్, ఇస్తున్న ఆఫర్ స్త్రీ ద్వేషాన్ని, నీ అజ్ఞానానికి నిదర్శనం’’ అని ఓ యూజర్ మండిపడ్డాడు. (వీడియో కోసం)