లాక్డౌన్లో భారీగా పెరిగిన ఎయిడ్స్ కేసులు.. రెండో స్థానంలో ఏపీ
- దేశవ్యాప్తంగా 85 వేల కేసుల నమోదు
- 10 వేల కేసులతో తొలి స్థానంలో మహారాష్ట్ర
- 9,521 కేసులతో రెండో స్థానంలో నిలిచిన ఏపీ
లాక్ డౌన్లో దేశంలో హెచ్ఐవీ కేసుల వివరాలకు సంబంధించి మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ (నాకో) ఈ వివరాలను వెల్లడించింది. ఇక లాక్డౌన్లో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో 10,498 కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్ర తర్వాతి స్థానంలో నిలిచిన ఏపీలో లాక్ డౌన్ సమయంలో 9,521 కేసులు నమోదయ్యాయి. ఏపీ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది.