జగన్ నిర్ణయమే ఫైనల్!... మంత్రి పదవుల రాజీనామాపై బొత్స!
- ఎవరిని కొనసాగించాలనేది జగన్ ఇష్టం
- దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మందిలో ఉంటాం
- వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యమన్న బొత్స
ఈ భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన బొత్స.. మంత్రుల రాజీనామాలు, తమ భవిష్యత్తు కార్యాచరణపై మీడియాతో మాట్లాడారు. తన కేబినెట్లో ఎవరిని ఉంచుకోవాలన్నది సీఎంగా జగన్ ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని కూడా బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో జగన్కు పూర్తి స్వేచ్ఛ ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మందిలో తనకు చోటు ఉంటుదన్న బొత్స.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూర్చడమే తమ లక్ష్యమని చెప్పారు.