నేడూ తప్పని పెట్రో బాదుడు.. హైదరాబాద్లో రూ.111 దాటిన పెట్రోలు ధర
- ఐదు రోజుల్లో నాలుగోసారి పెరిగిన ధరలు
- నేడు పెట్రోలుపై 89, డీజిల్పై 86 పైసల పెంపు
- విజయవాడలో లీటరు పెట్రోలు రూ.113.60కి చేరిక
పెట్రోలుపై 89 పైసలు, డీజిల్పై 86 పైసలు పెంచాయి. ఫలితంగా హైదరాబాద్లో ఇప్పుడు లీటరు పెట్రోలు ధర రూ. 111.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.10కి పెరిగింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ. 113.60 కాగా, డీజిల్ ధర రూ.99.50గా ఉంది. ఈ ఐదు రోజుల్లో పెట్రో ధరలు లీటరుకు రూ.3.20 పెరిగాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం ఆరు గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.