దీదీ మేనల్లుడికి మరోమారు ఈడీ నోటీసులు
- ఇప్పటికే ఓ దఫా ఈడీ విచారణకు అభిషేక్
- తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసిన ఈడీ
- ఈ నెల 29న విచారణకు రావాలంటూ ఆదేశం
మనీ ల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ జారీ చేసిన నోటీసులకు అనుగుణంగా సోమవారం నాడు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన అభిషేక్ బెనర్జీని అధికారులు ఏకంగా 8 గంటలకు పైగా విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణపైనే తృణమూల్ కాంగ్రెస్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో మరోమారు అభిషేక్కు ఈడీ నోటీసులు జారీ చేసింది.