Lakshmi Parvati: 26 ఏళ్ల తర్వాత చెపుతున్నా.. ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను: లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

NTR soul spoke to me says Lakshmi Parvati

  • జీవిత, రాజశేఖర్ నన్ను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారు
  • ఆ అమ్మాయిలోకి ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించింది
  • నాతో ఎన్టీఆర్ ఆత్మ ఎన్నో విషయాలను పంచుకుంది

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు. 26 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని బయటపెడుతున్నానని తెలిపారు. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని లక్ష్మీపార్వతి చెప్పారు. జీవిత, రాజశేఖర్ లు తనను మద్రాస్ కు పిలిపించి, ఒక అమ్మాయితో మాట్లాడించారని... ఆ 16 ఏళ్ల అమ్మాయిలోకి ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించి తనతో మాట్లాడిందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ తనతో ఎన్నో విషయాలను పంచుకుందని చెప్పారు.
 
ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న అంశంపై ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయించడం ద్వారా సీఎం జగన్ చాలా హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు. దుర్గిలో విగ్రహ ధ్వంసంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానని చెప్పారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని సూచించారు. తెలుగు ప్రజలపై ఎన్టీఆర్ చూపు ఉండాలని ఆకాంక్షించారు.

Lakshmi Parvati
YSRCP
NTR
Soul
  • Loading...

More Telugu News