సాగర్ కుడికాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి బంధువుల మృతి
- షాపింగ్ కోసం భార్య, కుమార్తెతో కలిసి విజయవాడ వెళ్లిన మదన్మోహనరెడ్డి
- తిరిగి వస్తుండగా అడిగొప్పుల వద్ద ప్రమాదం
- ఈదుకుంటూ బయటపడిన మదన్మోహన్రెడ్డి
- కారులో చిక్కుకుపోయి మృతి చెందిన భార్య, కుమార్తె
షాపింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా అడిగొప్పుల సమీపంలో ఓ బైక్ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. మదనమోహన్రెడ్డి ఎలాగోలా బయటపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో కారు కొట్టుకుపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు బుగ్గవాగు రిజర్వాయర్ వద్ద నీటిని కిందకు వెళ్లకుండా నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. కారులోనే చిక్కుకుపోయిన మదన్మోహనరెడ్డి భార్య, కుమార్తె మరణించారు. ఈ ఘటనతో పిన్నెల్లి కుటుంబంలో విషాదం అలముకుంది.