actress Janhvi Kapoor: తిరుమల శ్రీవారి సేవలో నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్

 Bollywood actress Janhvi Kapoor visits Tirumala

  • వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం
  • ఆమె వెంట మరొకరు
  • అర్చకుల ఆశీర్వచనం

నటనా దిగ్గజం, దివంగత శ్రీదేవి కుమార్తె, వర్థమాన బాలీవుడ్ నటి అయిన జాన్వీ కపూర్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవలో తరించారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీ దిగేందుకు కొందరు భక్తులు ఆసక్తి చూపించారు.

సంప్రదాయ చీరకట్టులో జాన్వీ కపూర్ కనిపించారు. ముఖానికి మాస్క్ ధరించి ఉన్నారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. ఆమె వెంట మరొకరు కూడా ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లతో ఆసక్తికరంగా మార్చేశారు.

  • Loading...

More Telugu News