Botsa Satyanarayana: ఆ ఉత్తర్వుల వెనుక అచ్చెన్నాయుడు ఉండొచ్చు: బొత్స

Atchannaidu may be behind those orders says Botsa

  • పేదల కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చినా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు
  • ప్రజలు అడిగినందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చాం
  • స్వచ్ఛందంగా వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తాం

పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ టీడీపీపై మండిపడ్డారు. పేదల కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చినా విమర్శిస్తున్నారని అన్నారు. గతంలో ఇళ్ల పట్టాల విషయంలో కూడా టీడీపీ ఇలాగే అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఈ పథకం ప్రభుత్వం సొంతంగా తీసుకొచ్చింది కాదని... పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగినందుకే తీసుకొచ్చామని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు.
 
ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా టెక్కలి నియోజకవర్గంలోని ఓ పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులను విడుదల చేశారని... ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని సస్పెండ్ చేశామని బొత్స చెప్పారు. పంచాయతీ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల వెనుక టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉండొచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News