ఇది ఎవరికీ భయపడి తీసుకున్న నిర్ణయం కాదు: మంత్రి బొత్స
- వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న ప్రభుత్వం
- సీఆర్డీయే రద్దు నిర్ణయం వెనక్కి
- సభలో సీఎం జగన్ ప్రకటన
- చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నామన్న బొత్స
అయితే, బిల్లుల ఉపసంహరణ నిర్ణయం ఎవరికీ భయపడి తీసుకున్నది కాదని, తాము చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నామని బొత్స స్పష్టం చేశారు. చట్ట, న్యాయపరమైన అంశాలకు పరిష్కారాలు తెస్తామని, అందరి అపోహలు, అనుమానాలు తీరుస్తామని చెప్పారు. మరింత మెరుగైన బిల్లుతో మళ్లీ ముందుకొస్తామని తెలిపారు.