కేటీఆర్ ట్వీట్.. కౌనబనేగా క్రోర్పతిలో ప్రశ్న.. సమాధానం చెప్పిన సౌరవ్ గంగూలీ
- అమితాబ్ కేబీసీ షోకు గంగూలీ, సెహ్వాగ్
- ఈ ఏడాది మే 20న కేటీఆర్ ట్వీట్
- దీనిని ఎవరికి ట్యాగ్ చేశారని అమితాబ్ ప్రశ్న
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కేటీఆర్ ట్వీట్కు బదులిస్తూ తానైతే కరోనిల్, కరోజీరో, గో కరోనా గో వంటి పేర్లు పెడతానని పేర్కొన్నారు. తాజాగా, ఇదే ప్రశ్నను అమితాబ్ తన కేబీసీ షోలో అడిగారు. కేటీఆర్ తన ట్వీట్ను ఎవరికి ట్యాగ్ చేశారని ప్రశ్నించారు. సౌరవ్ గంగూలీ బాగా ఆలోచించిన అనంతరం శశిథరూర్ అని సరైన సమాధానం ఇచ్చారు. కేబీసీలో తన ట్వీట్ను ప్రశ్నగా అడగడంపై కేటీఆర్ తాజాగా స్పందించారు. సరదాగా చేసిన ట్వీట్ కేబీసీలో ప్రశ్నగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, ఈ షోలో గంగూలీ, సెహ్వాగ్ జంట రూ. 25 లక్షలు గెలుచుకున్నారు.