'మా' జనరల్ బాడీ సమావేశంలో మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు!
- హైదరాబాదులో 'మా' సర్వసభ్య సమావేశం
- హాజరైన మోహన్ బాబు
- 'మా' కోసం స్థలం కొని అమ్మేశారని ఆరోపణ
- పెద్దలు ఆలోచించాలని వ్యాఖ్యలు
"భవనం కోసం స్థలం కొన్నారు... అమ్మేశారు. రూపాయికి కొన్న స్థలాన్ని అర్ధరూపాయికి అమ్మేశారు. ఇది ఎంతవరకు సబబు? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. 'మా'కు సొంత భవనం కోసం కేటాయించిన సొమ్ముతో స్థలం కొని దాన్ని సగం ధరకే అమ్మేయడంపై సినీ పెద్దలు ఆలోచించాలి" అని వ్యాఖ్యానించారు.