'కొండ పొలం' నుంచి వైష్ణవ్ తేజ్ ఫస్టులుక్!
- వైష్ణవ్ తేజ్ నుంచి మరో సినిమా
- 'కొండ పొలం' టైటిల్ ఖరారు
- సంగీత దర్శకుడిగా కీరవాణి
- అక్టోబర్ 8వ తేదీన విడుదల
అలా దర్శకుడు క్రిష్ 'కొండ పొలం' అనే ఒక సినిమాను చేశారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. కేవలం 40 రోజుల్లో ఆయన ఈ సినిమాను పూర్తిచేశారట. రకుల్ ప్రీత్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, చాలా రోజుల క్రితమే పూర్తయినా సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది.
రాజీవ్ రెడ్డి - సాయిబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమాకి 'కొండ పొలం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.