రమ్య కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేశ్.. తీవ్ర ఉద్రిక్తత
- గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య
- మృతదేహానికి నివాళి అర్పించిన నారా లోకేశ్
- పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట
ఈ సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అనంతరం పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.