Nagashaurya: మళ్లీ సెట్స్ పైకి వచ్చేసిన 'వరుడు కావలెను'

- నాగశౌర్య నుంచి 'వరుడు కావలెను'
- కథానాయికగా రీతూ వర్మ
- దర్శకురాలిగా లక్ష్మీ సౌజన్య
- ఈ ఏడాదిలోనే రిలీజ్
నాగశౌర్యకి కొంతకాలంగా సరైన హిట్ లేదు ... ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా 'లక్ష్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉండగా, 'వరుడు కావలెను' సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా, ఈ రోజున మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఈ షెడ్యూల్లో నాగశౌర్య .. రీతూ వర్మ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
