ఉత్కంఠను రేకెత్తించే కొత్త కథతో సందీప్ కిషన్!
- వీఐ ఆనంద్ తో సందీప్ కిషన్
- గతంలో 'టైగర్'తో లభించిన హిట్
- ఈ సారి కొత్త కాన్సెప్ట్ తో ప్రయోగం
- త్వరలో రెగ్యులర్ షూటింగ్
ఆ తరువాత సినిమాను సందీప్ కిషన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. సూపర్ నేచురల్ ఫాంటసీ కలయికగా ఈ సినిమా రూపొందనుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, రాజేశ్ దందా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్టు పోస్టర్ ను విడుదల చేశారు. గతంలో వీఐ ఆనంద్ - సందీప్ కిషన్ కాంబినేషన్లో వచ్చిన 'టైగర్' సినిమా హిట్ అయింది. మరి కొత్త కాన్సెప్ట్ తో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.