మల్టీస్టారర్ మూవీలో డిఫరెంట్ రోల్ చేస్తున్న రావు రమేశ్!
- విలక్షణ నటుడిగా గుర్తింపు
- వరుస సినిమాలతో బిజీ
- డైలాగ్ విరుపులో ప్రత్యేకత
ప్రస్తుతం రావు రమేశ్ చేస్తున్న సినిమాల జాబితాలో 'మహాసముద్రం' ఒకటి. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తున్నఈ సినిమాలో, అదితీరావు - అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. ఈ సినిమాలో రావు రమేశ్ ఒక కీలకమైన పాత్రను చేస్తున్నాడట. ఈ పాత్రలో ఆయన నెగెటివ్ షేడ్స్ కలిగిన గూనివాడిగా కనిపిస్తూనే చక్రం తిప్పుతాడట. ఆయన కెరియర్లో చేసిన ప్రత్యేకమైన పాత్రల వరుసలో ఈ పాత్ర కూడా చేరుతుందని అంటున్నారు. మహాసముద్రాన్ని అల్లకల్లోలం చేసేది ఈ పాత్రేనన్నమాట!