కేంద్ర మంత్రులతో మోదీ కీలక భేటీ.. దేశవ్యాప్త లాక్డౌన్పై స్పష్టత
- రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై చర్చ
- దేశ వ్యాప్త లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని స్పష్టం
- రాష్ట్రాల్లో ఉన్న కరోనా కేసుల ఆధారంగా కట్టడి చర్యలు తీసుకోవాలని సూచన
- కంటైన్మెంట్ జోన్లను కొనసాగించాలని వ్యాఖ్య
కరోనా రోగులు ప్రతిరోజు లక్షల సంఖ్యలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సౌకర్యాల వంటి వాటిపై కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. దేశ వ్యాప్త లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు.
రాష్ట్రాల్లో ఉన్న కరోనా కేసుల ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనా అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను కొనసాగించాలని చెప్పారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు.