Kangana Ranaut: పరువు నష్టం దావా కేసులో కంగనకు బెయిల్ మంజూరు ‌

Kangana Granted bail in defamation case

  • కంగనపై జావెద్‌ అక్తర్‌ కేసు
  • సుశాంత్‌ సింగ్‌ కేసులోకి కంగన అనవసరంగా లాగిందని ఆవేదన
  • బెయిల్‌ మంజూరుకు అంగీకరించిన అంధేరి మెట్రోపాలిటన్‌ కోర్టు

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌పై ప్రముఖ గేయ రచయిత జావెద్‌ అక్తర్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో ఆమెకు బెయిల్‌ మంజూరైంది. ముంబయిలోని అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ ఆమెకు బెయిల్‌ ఇచ్చారు. గురువారం కంగన కోర్టు ముందు హాజ‌రైంది. బెయిల్ వారెంట్‌ను ర‌ద్దు చేయాల‌ని న్యాయస్థానాన్ని కోరింది. కోర్టు అంగీకరించడంతో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంలో‌ మిస్టరీకి సంబంధించి న్యాయం జరగాలని కంగన ట్విట్టర్ వేదికగా పలుమార్లు డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో ఆమె పలు ఛానళ్లలో దీనిపై మాట్లాడారు. ఈ సందర్భంగా కంగన తన పేరును సుశాంత్‌ కేసులోకి అన్యాయంగా లాగినట్లు జావెద్‌ ఆరోపించారు. కంగన చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు.

Kangana Ranaut
Bollywood
Sushanth singh rajput
javed akhtar
  • Loading...

More Telugu News